గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనలో సర్పంచ్ల కృషి
ABN , First Publish Date - 2023-03-25T22:59:58+05:30 IST
గ్రామాల్లో మౌళిక సౌకర్యాలు కల్పించటంలో సర్పంచ్ల కృషి ప్రశంసనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
తల్లాడ, మార్చి 25: గ్రామాల్లో మౌళిక సౌకర్యాలు కల్పించటంలో సర్పంచ్ల కృషి ప్రశంసనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం తల్లాడ గ్రామపంచాయతీ ఆవరణలో నేషనల్ పంచాయతీ అవార్డులను సర్పంచ్లు, కార్యదర్శులకు ఆయన ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్లు, కార్యదర్శులను శాలువలతో సన్మానించి మెమోంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం సహకరించకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నప్పటికీ సీఎం కేసీఆర్ పంచాయతీల అభివృద్ధికి హితోధికంగా సహకరిస్తున్నట్లు కొనియాడారు. సర్పంచ్ల గౌరవాన్ని సీఎం కేసీఆర్ పెంచారని దీంతో సర్పంచ్లు ఉత్సాహంగా అభివృద్ధిలో ఒకరికి మించి మరొకరు అభివృద్ధి కోసం పోటీపడ్డారన్నారు. జిల్లాస్థాయిలో అవార్డులు పొందిన తల్లాడ, కుర్నవల్లి సర్పంచ్లు పొట్టేటి సంధ్యారాణి, అయిలూరి లక్ష్మీ, ఈవో ఉమ, కార్యదర్శి వెంకటేష్లను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, ఎంపీడీవో భీమిరెడ్డి రవీందర్రెడ్డి, ఎంపీవో కొండపల్లి శ్రీదేవి, రైతుబంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్లాల్, ఏఎంసీ వైస్చైర్మన్ దూపాటి భద్రరాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.