పంట నష్టాన్ని కచ్చితంగా నమోదుచేయాలి
ABN , First Publish Date - 2023-03-25T23:01:01+05:30 IST
పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో ఈవోలు పర్యటించి కచ్చితంగా నమోదుచేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి విజయనిర్మల ఆదేశించారు.
ఏన్కూరు, మార్చి25: పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో ఈవోలు పర్యటించి కచ్చితంగా నమోదుచేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి విజయనిర్మల ఆదేశించారు. శనివారం మండలంలోని తిమ్మరావుపేట, మూలపోచారం, రాంనగర్తండా గ్రామాల్లో పర్యటించారుక. పంటనష్టం, పంటల నమోదును పరిశీలించారు. జేడీఏ వెంట సహాయ వ్యవసాయ సంచాలకులు వి.బాబురావు, ఏవో ఎ.నర్సింహారావు, ఏఈవో బాలకృష్ణ పాల్గొన్నారు