దేశంలో టాప్ బ్రాండ్ టీసీఎస్
ABN , First Publish Date - 2023-06-01T00:31:22+05:30 IST
భారత్లోని అత్యంత విలువైన 50 బ్రాం డ్లలో ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ అగ్రస్థానంలో నిలిచింది. టీసీఎస్ బ్రాండ్ విలువ రూ.1,09,577 కోట్లుగా నమోదైనట్టు
న్యూఢిల్లీ: భారత్లోని అత్యంత విలువైన 50 బ్రాం డ్లలో ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ అగ్రస్థానంలో నిలిచింది. టీసీఎస్ బ్రాండ్ విలువ రూ.1,09,577 కోట్లుగా నమోదైనట్టు బ్రాండ్ కన్సల్టింగ్ సేవల సంస్థ ఇంటర్బ్రాండ్ తెలిపింది. రూ.65,321 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో అత్యంత విలువైన బ్రాండ్గా ఉంది. ఇన్ఫోసిస్ (రూ.53,324 కోట్లు), హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ (రూ.50,291 కోట్లు), జియో (రూ.49,027 కోట్లు) వరుసగా 3,4,5 స్థానాలను దక్కించుకున్నాయి. ఎయిర్టెల్, ఎల్ఐసీ, మహీంద్రా, ఎస్బీఐ, ఐసీఐసీఐ టాప్-10లోని మిగతా బ్రాండ్లుగా ఉన్నాయి. జాబితాలోని 50 బ్రాండ్ల మొత్తం విలువ రూ.8.31 లక్షల కోట్లుగా నమోదైంది. గడిచిన దశాబ్దకాలంలో ఈ విలువ 167 శాతం పెరిగిందని ఇంటర్బ్రాండ్ వెల్లడించింది.