యాక్సిస్ ఎంఎఫ్ నుంచి ఎస్ అండ్ పీ 500 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్
ABN , First Publish Date - 2023-03-26T04:08:07+05:30 IST
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. ఎస్ అండ్ పీ 500 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పేరుతో కొత్త ఫండ్ను తీసుకువచ్చింది...
ముంబై: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. ఎస్ అండ్ పీ 500 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పేరుతో కొత్త ఫండ్ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకం. ఈ ఫండ్కు ఎస్ అండ్ పీ 500 టీఆర్ఐ బెంచ్మార్క్గా ఉండనుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.500. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులు పెంచుకుంటూ పోవచ్చు. ఈ ఫండ్ ముగింపు తేదీ ఏప్రిల్ 5.