లాయిడ్స్ టెక్నాలజీ ఎండీగా శిరీష ఓరుగంటి
ABN , First Publish Date - 2023-07-06T02:15:16+05:30 IST
హైదరాబాద్లోని లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్కు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఓరుగంటి శిరీషను నియమించినట్టు లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ప్రకటించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్లోని లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్కు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఓరుగంటి శిరీషను నియమించినట్టు లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ప్రకటించింది. ఐటీ ఆర్కిటెక్చర్, డేటా ఇంజినీరింగ్, ఫిన్టెక్ ఇన్నోవేషన్ రంగాల్లో ఆమెకు విశేష అనుభవం ఉంది. త్వరలో ఆమె ఈ బాధ్యతలను స్వీకరిస్తారు.