సిగ్నిటీ టెక్నాలజీస్‌ లాభం రూ.45 కోట్లు

ABN , First Publish Date - 2023-07-29T00:29:01+05:30 IST

డిజిటల్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్‌ లాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన 43.7 శాతం పెరిగింది.

సిగ్నిటీ టెక్నాలజీస్‌ లాభం రూ.45 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డిజిటల్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్‌ లాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన 43.7 శాతం పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.31 కోట్లు ఉండ గా.. 2023, జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.44.56 కోట్లకు చేరింది. ఆదాయం కూడా 16.3 శాతం వృద్ధితో రూ.377.97 కోట్ల నుంచి రూ.439.53 కోట్లకు చేరింది.

Updated Date - 2023-07-29T00:29:01+05:30 IST