ఎల్ఐసీ చైర్మన్గా సిద్ధార్థ మొహంతి
ABN , First Publish Date - 2023-04-29T01:58:59+05:30 IST
సిద్ధార్థ మొహంతిని ఎల్ఐసీ కొత్త చైర్మన్గా ప్రభుత్వం నియమించింది.
న్యూఢిల్లీ: సిద్ధార్థ మొహంతిని ఎల్ఐసీ కొత్త చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఆయన 2025 జూన్ ఏడో తేదీ వరకు లేదా ఆయనకు 62 సంవత్సరాలు నిండే వరకు మొహంతి పదవిలో ఉంటారు. ఆ సంస్థ మాజీ ఎండీ బీసీ పట్నాయక్ను ఐఆర్డీఏఐ మెంబర్గా (లైఫ్) నియమించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సారథులను ఎంపిక చేసే ఆర్థిక సేవల సంస్థల బ్యూరో (ఎఫ్ఎ్సఐబీ) గత నెలలో మొహంతిని ఎల్ఐసీ చైర్మన్గా నియమించేందుకు సిఫారసు చేసింది.