ఎన్ఎ్ఫసీఎల్ మొండి బకాయిలు ఎకర్ ఏఆర్సీ చేతికి!
ABN , First Publish Date - 2023-03-31T01:52:57+05:30 IST
నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఎన్ఎ్ఫసీఎల్) నుంచి రావాల్సిన రూ.1,500 కోట్ల మొండి బకాయిలను బ్యాంకులు ఎకర్ ఏఆర్సీకి బ్యాంకులు బదిలీ చేసినట్లు తెలుస్తోంది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఎన్ఎ్ఫసీఎల్) నుంచి రావాల్సిన రూ.1,500 కోట్ల మొండి బకాయిలను బ్యాంకులు ఎకర్ ఏఆర్సీకి బ్యాంకులు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. రూ.811 కోట్లకు ఈ మొండి బకాయిలను ఎకర్ ఏఆర్సీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొండి బకాయిల ప్రక్రియ పూర్తయినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్ఎ్ఫసీఎల్ చెల్లించాల్సిన మొండి బకాయిలను కొనుగోలు చేయడానికి రూ.811 కోట్లకు ఎకర్ బిడ్ను దాఖలు చేసింది. స్విస్ చాలెంజింగ్ విధానంలో బ్యాంకుల కన్సార్షియం కూడా బిడ్స్ ఆహ్వానించింది. అయితే..ఎటువంటి బిడ్లు రాకపోవడంతో మొండి బకాయిలు ఎకర్ చేతికి వచ్చినట్లు చెబుతున్నారు.