మార్కెట్లోకి మహీంద్రా థార్ కొత్త వెర్షన్
ABN , First Publish Date - 2023-01-10T01:14:02+05:30 IST
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం).. తన ఎస్యూవీ ‘థార్’లో కొత్త వెర్షన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం).. తన ఎస్యూవీ ‘థార్’లో కొత్త వెర్షన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్స్, రెండు ఇంజన్స్ ఆప్షన్స్, రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్స్ (4వీల్ డ్రైవ్ సామర్థ్యంతో కాకుండా)తో ఈ కొత్త వెర్షన్ను తీసుకువచ్చినట్లు మహీంద్రా తెలిపింది. డీజిల్ ఇంజన్తో కూడిన థార్ ధరలు రూ.9.99 లక్షలు, రూ.10.99 లక్షలుగా ఉండగా పెట్రోల్ ఆటోమెటిక్ వేరియంట్ ధర రూ.13.49 లక్షలు (ఎక్స్షోరూమ్)గా ఉంది.