Share News

సైయెంట్‌ డివిడెండ్‌ 240%

ABN , First Publish Date - 2023-10-20T03:18:27+05:30 IST

వాటాదారులకు సైయెంట్‌ 240 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై రూ.12 డివిడెండ్‌ చెల్లించాలని...

సైయెంట్‌ డివిడెండ్‌ 240%

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వాటాదారులకు సైయెంట్‌ 240 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై రూ.12 డివిడెండ్‌ చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. డివిడెండ్‌ చెల్లింపునకు నవంబరు 1వ తేదీని రికార్డు తేదీగా పరిగణిస్తారు. కాగా ఏకీకృత ప్రాతిపదికన సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి సైయెంట్‌ రూ.183.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.79.1 కోట్లతో పోలిస్తే 132 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికానికి మొత్తం ఆదాయం రూ.1,416 కోట్ల నుంచి రూ.1,792 కోట్లకు చేరింది.

Updated Date - 2023-10-20T03:18:27+05:30 IST