అజాద్ ఇంజనీరింగ్ లిస్టింగ్ ఆకర్షణీయం
ABN , Publish Date - Dec 29 , 2023 | 04:52 AM
స్టాక్ ఎక్స్ఛేం జీల్లో అజాద్ ఇంజనీరింగ్ షేర్లు ఆకర్షణీయంగా లిస్ట య్యాయి. ఇష్యూ ధర రూ.524తో పోలిస్తే 35.49 శాతం ప్రీమియంతో రూ.710 వద్ద బీఎస్ఈలో నమోదైంది...
35% పైగా ప్రీమియంతో లిస్టింగ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్టాక్ ఎక్స్ఛేం జీల్లో అజాద్ ఇంజనీరింగ్ షేర్లు ఆకర్షణీయంగా లిస్ట య్యాయి. ఇష్యూ ధర రూ.524తో పోలిస్తే 35.49 శాతం ప్రీమియంతో రూ.710 వద్ద బీఎస్ఈలో నమోదైంది. ఆ తర్వాత మరింత పెరిగి 38.83 శాతం అధికంగా రూ.727.5 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈలో 37.4 శాతం అధికంగా రూ.720 వద్ద లిస్టయిందని కంపెనీ వెల్లడిం చింది. అయితే.. బీఎస్ఈలో చివరకు 29.21 శాతం లాభంతో రూ.677.1 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో 28.48 శాతం లాభంతో రూ.673.25 వద్ద క్లోజైంది. మొదటి రోజు షేర్ ముగింపు ధర ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ రూ.4,002.54 కోట్లుగా ఉంది.