పదేళ్లలో 3 రెట్లు రాబడి

ABN , First Publish Date - 2023-09-20T02:10:52+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీల అభివృద్ధికి జాతీ య స్థాయిలో టాప్‌ 5 ఆకర్షణీయ గమ్యాల్లో హైదరాబాద్‌లోని కొంపల్లి-మేడ్చల్‌-షామీర్‌పేట్‌ జోన్‌ కూడా ఉంది. హైదరాబాద్‌ మెట్రోను విస్తరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన కారిడార్లు...

పదేళ్లలో 3 రెట్లు రాబడి

  • రియల్టీకి ఆకర్షణీయ గమ్యంగా కొంపల్లి-మేడ్చల్‌-షామీర్‌పేట్‌ జోన్‌

  • కోలియెర్స్‌ ఇండియా నివేదిక

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీల అభివృద్ధికి జాతీ య స్థాయిలో టాప్‌ 5 ఆకర్షణీయ గమ్యాల్లో హైదరాబాద్‌లోని కొంపల్లి-మేడ్చల్‌-షామీర్‌పేట్‌ జోన్‌ కూడా ఉంది. హైదరాబాద్‌ మెట్రోను విస్తరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన కారిడార్లు రెండింటిలో ఈ జోన్‌ కూడా ఉంది. ఈ కారిడార్‌లో భూమి కొనుగోళ్లకు పెట్టే పెట్టుబడులపై వచ్చే పదేళ్లలో 3 రెట్లు రాబడి వచ్చే ఆస్కారం ఉన్నట్టు కోలియెర్స్‌ ఇండియా తాజా నివేదికలో తెలిపింది. మహారాష్ట్రలోని నేరల్‌-మథేరాన్‌ జోన్‌ టాప్‌ వన్‌లో ఉండగా గుజరాత్‌లోని సనంద్‌-నల్సరోవర్‌ రెండో స్థానంలో నిలిచింది. చెన్నై సమీపంలోని ఈసీఆర్‌-ఇంజంబాక్కం-కోవలం, కోల్కతాలోని న్యూటౌన్‌-రాజర్హాట్‌ మిగతా రెండు జోన్లు. ఙక్కడ భూములు కొనుగోలు చేసే ఇన్వెస్టర్లు ఆకర్షణీయమైన రాబడుల కోసం వారాంతపు విశ్రాంతి గృహాలు, హాలిడే హోమ్స్‌, రిటైర్మెంట్‌ హోమ్స్‌ వంటివి నిర్మించవచ్చునని ఆ నివేదిక పేర్కొంది. అవసరానికి భూముల కొనుగోలు ఆలోచనా ధోరణిని దాటి ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఇన్వెస్టర్ల సంపద మరింతగా పెరిగడంతో పాటు దాన్ని సక్రమంగా వినియోగించుకున్నట్టయితే నిలకడ రాబడులకు ఒక ఆధారంగా కూడా ఉండవచ్చునని తెలిపింది.

Updated Date - 2023-09-20T02:10:52+05:30 IST