Yuvagalam Padayatra : యువగళానికి సంఘీభావంగా 3 వేల ఆటోలతో ర్యాలీ
ABN , First Publish Date - 2023-12-11T01:14:16+05:30 IST
యువగళం పాదయాత్ర 3000 కి.మీ.కి చేరడంతో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ గుంటూరు నగరంలో 3 వేల ఆటోలతో భారీ
గుంటూరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): యువగళం పాదయాత్ర 3000 కి.మీ.కి చేరడంతో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ గుంటూరు నగరంలో 3 వేల ఆటోలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలో ఇన్నర్ రింగు రోడ్డులోని శిల్పారామం వద్ద ఆదివారం ఉదయం మన్నవ మోహనకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వేలాది మంది కార్యకర్తలు, లోకేశ్ అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. యువగళానికి సంఘీభావంగా, లోకేశ్కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ.. యువనేత చేపట్టిన యువగళం ప్రజాగళంగా మారి, వైసీపీకి గొంతులో గరళంగా మారిందన్నారు.