వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలి
ABN , First Publish Date - 2023-03-25T22:34:02+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ఽఅధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో అరాచక పాలన తప్ప మరోటి లేదని, ప్రజలు చరమగీతం పాడాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జీవీ ప్రవీణ్కుమార్రెడ్డి పిలుపు ఇచ్చారు.
టీడీపీ ఇన్చార్జి జీవీ ప్రవీణ్కుమార్రెడ్డి
ప్రొద్దుటూరు క్రైం, మార్చి 25 : రాష్ట్రంలో వైసీపీ ఽఅధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో అరాచక పాలన తప్ప మరోటి లేదని, ప్రజలు చరమగీతం పాడాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జీవీ ప్రవీణ్కుమార్రెడ్డి పిలుపు ఇచ్చారు. శనివారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని పురపాలక పరిధి వసంతపేటలో ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీఎస్ ముక్తియార్, ఈవీ సుధాకర్రెడ్డి, సానా విజయభాస్కర్రెడ్డి, సుంకర వేణుగోపాల్, నల్లబోతుల నాగరాజు, యమ్మనూరు ఆంజినేయులు, పెన్నానగర్ మజీద్, గోపవరం గౌస్, పట్నం మాబాష, పిట్టర్ రఫీ, ఐటీడీపీ విమల్ ఇర్ఫాన్, సుదర్శన్, శివ పాల్గొన్నారు.