అప్పుల బాధతో యువ కౌలు రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-01-26T04:30:11+05:30 IST

రుణభారం పల్నాడు జిల్లాలో ఓ యువ కౌలు రైతు ప్రాణాలు తీసింది. యడ్లపాడు మండలం కారుచోల ఎస్సీ కాలనీకి చెందిన అంబడిపూడి వెంకట రత్తయ్య (29) భూమి కౌలుకు తీసుకుని కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు.

అప్పుల బాధతో యువ కౌలు రైతు ఆత్మహత్య

యడ్లపాడు, జనవరి 25: రుణభారం పల్నాడు జిల్లాలో ఓ యువ కౌలు రైతు ప్రాణాలు తీసింది. యడ్లపాడు మండలం కారుచోల ఎస్సీ కాలనీకి చెందిన అంబడిపూడి వెంకట రత్తయ్య (29) భూమి కౌలుకు తీసుకుని కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. గత ఏడాది మిర్చి సాగుచేయగా తామర పురుగు ఆశించి సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లింది. కాగా.. ఈ ఏడాది మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని రెండెకరాల్లో మిర్చి, మరో ఎకరంన్నరలో పత్తి సాగు చేశాడు. అకాల వర్షాలకు పంట పూర్తిగా ఉరకెత్తి ఎండిపోయింది. వీటి సాగు కోసం చేసిన రూ.3 లక్షలు, గతంలో చేసిన అప్పులతో కలిపి రూ.4 లక్షలకు చేరడంతో అవి తీర్చే మార్గంలేక మంగళవారం ఉదయం పొలానికి వెళ్లి గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే రత్తయ్యను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.

Updated Date - 2023-01-26T04:30:11+05:30 IST