భీమవరంలో జస్టిస్ వెంకట రమణ పూజలు
ABN , First Publish Date - 2023-04-03T02:13:10+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వర, జనార్దన స్వామి, మావుళ్లమ్మ అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వెంకట రమణ ఆదివారం దర్శించుకున్నారు.
భీమవరం టౌన్, ఏప్రిల్ 2: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వర, జనార్దన స్వామి, మావుళ్లమ్మ అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వెంకట రమణ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన న్యాయమూర్తి దంపతులు సోమేశ్వరస్వామికి, మావుళ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి దేవస్థానం తరపున శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందించారు.