పట్టిసీమ నుంచి ఎట్టకేలకు నీరు విడుదల

ABN , First Publish Date - 2023-07-21T03:09:39+05:30 IST

పట్టిసీమ నుంచి ఎట్టకేలకు ప్రభుత్వం కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసింది. ఈ ఏడాది డెల్టా నీటి అవసరాలను తీర్చేంతగా వానలు పడలేదు.

పట్టిసీమ నుంచి ఎట్టకేలకు నీరు విడుదల

అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ నుంచి ఎట్టకేలకు ప్రభుత్వం కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసింది. ఈ ఏడాది డెల్టా నీటి అవసరాలను తీర్చేంతగా వానలు పడలేదు. దీంతో పట్టిసీమ ఎత్తిపోతల పంపులు ఆన్‌చేసి గోదావరి జలాలివ్వాలని రైతులు చాలా రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. అయినా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. టీడీపీ నేతలు కూడా గత 15 రోజులుగా గళమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. కృష్ణా డెల్టాకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి సాగుతో పాటు తాగునీటికి కూడా జలాలు ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జల వనరుల మంత్రి అంబటి రాంబాబు గురువారం ఇరిగేషన్‌ క్యాంపు కార్యాలయంలో వెల్లడించారు. నాగార్జున సాగర్‌ కుడికాలువ నుంచి కృష్ణా డెల్టాకు విడుదలైన ఐదు టీఎంసీల నీటిని పులిచింతలలో నిల్వ చేసి.. భవిష్యత్‌ అవసరాల కోసం వినియోగిస్తామని చెప్పారు.

Updated Date - 2023-07-21T03:09:39+05:30 IST