వలంటీర్లు భయపడొద్దు!
ABN , First Publish Date - 2023-02-07T04:06:36+05:30 IST
‘ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో.. దేనికి వేయకూడదో.. వలంటీరు చెప్పకూడదని ఎవడు చెప్పాడు’ అంటూ మం త్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.
ముందుగా మనమే తుపాకీని పేల్చేద్దాం: మంత్రి ధర్మాన వ్యాఖ్యలు
శ్రీకాకుళం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ‘ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో.. దేనికి వేయకూడదో.. వలంటీరు చెప్పకూడదని ఎవడు చెప్పాడు’ అంటూ మం త్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడలో పా ల్గొన్న మంత్రి ధర్మాన ఇంకా ఏమన్నారంటే.. ‘‘ప్రతి పౌరుడికీ హక్కు ఉంది. వ లంటీర్ కూడా పౌరుడే. మీరు ఉత్తినే భయపడొద్దు. వాడు మాయ చేసి చెప్పొద్దంటాడు.. విషయం తెలియకుండా అలా చేస్తాడు(ప్రతిపక్షాలను ఉద్దేశించి). వలంటీరు ఒక కుటుంబాన్నయినా మార్చాలి. చంద్రబాబు వస్తే మొ దటి ఫైరింగ్ ఎవరిపైనో తెలుసా? వలంటీర్ పైనే. ఆయనే పేల్చడం ఎందు కు.? మనమే పేల్చేద్దాం. తుపాకీ మన వద్దనే ఉంది’’ అంటూ ధర్మాన పేర్కొన్నారు.