Share News

పురందేశ్వరి పర్యటన విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2023-11-26T23:47:49+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి పురందేశ్వరిగా బాధ్యతలు చేపట్టి తర్వాత తొలి సారిగా మంగళవారం జిల్లా పర్యటనకు వస్తుండడంతో నాయ కులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నడి కుదిటి ఈశ్వరావు (ఎన్‌ఈఆర్‌) పిలుపునిచ్చారు. ఆదివారం విజయన గరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార జిల్లా ప్రతినిధి బైవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి ఉప్పలపాటి శ్రీనివాసవర్మతో కలిసి ఎన్‌ఈఆర్‌ విలేకరులతో మాట్లాడారు. వీటిఅగ్రహారం వైజంక్షన్‌ వద్ద ఉదయం పది గంట లకు గజమాలతో స్వాగతం పలికి, అనంతరం మయూరి జంక్షన్‌ రైల్వేస్టేషన్‌ రోడ్డు, కన్యాకాపరమేశ్వరి ఆలయం మీదుగా పైడితల్లమ్మ ఆలయానికి చేరు కుని అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు.

పురందేశ్వరి పర్యటన విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న ఎన్‌ఈఆర్‌ :

దాసన్నపేట: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి పురందేశ్వరిగా బాధ్యతలు చేపట్టి తర్వాత తొలి సారిగా మంగళవారం జిల్లా పర్యటనకు వస్తుండడంతో నాయ కులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నడి కుదిటి ఈశ్వరావు (ఎన్‌ఈఆర్‌) పిలుపునిచ్చారు. ఆదివారం విజయన గరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార జిల్లా ప్రతినిధి బైవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి ఉప్పలపాటి శ్రీనివాసవర్మతో కలిసి ఎన్‌ఈఆర్‌ విలేకరులతో మాట్లాడారు. వీటిఅగ్రహారం వైజంక్షన్‌ వద్ద ఉదయం పది గంట లకు గజమాలతో స్వాగతం పలికి, అనంతరం మయూరి జంక్షన్‌ రైల్వేస్టేషన్‌ రోడ్డు, కన్యాకాపరమేశ్వరి ఆలయం మీదుగా పైడితల్లమ్మ ఆలయానికి చేరు కుని అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. అనంతరం కోట జంక్షన్‌ వద్ద ఉజ్వల గ్యాస్‌ లబ్ధిదారులకు కనెక్షన్లు అందజేస్తారని చెప్పారు. బాలాజీ, ఆర్జీసీ కాంప్లెక్స్‌ మీదుగా తోటపాలెం సాయిబాలాజీ పంక్షన్‌ హాల్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ఫంక్షన్‌ హాల్‌లో పోలింగ్‌ బూత్‌ కమిటీలు, శక్తి కేంద్ర ప్రముఖులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావే శంలో పార్టీ నాయకులు సురేష్‌, రమేష్‌, పిల్లా నవీన్‌ కుమార్‌, లక్ష్మీనరసిం హం, గోలగాన రమేషే, గోపాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-26T23:47:50+05:30 IST