వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలి
ABN , First Publish Date - 2023-06-01T05:39:30+05:30 IST
ఆంధ్రప్రదేశ్ వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మద్దూరు సుభాష్ చంద్రబోస్ కోరారు.
న్యూఢిల్లీ, మే 31(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మద్దూరు సుభాష్ చంద్రబోస్ కోరారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వాల్మీకుల సంకల్ప దీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.