దాహం తీర్చుకుంటూ సంపులో పడి ఇద్దరు

ABN , First Publish Date - 2023-06-02T04:30:57+05:30 IST

కుందేలు వేటకు వెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తూ నీటి సంపులో మునిగిపోయి మృతిచెందారు.

దాహం తీర్చుకుంటూ సంపులో పడి ఇద్దరు

యల్లనూరు, జూన్‌ 1: కుందేలు వేటకు వెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తూ నీటి సంపులో మునిగిపోయి మృతిచెందారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా యల్లనూరు మండలం పరిధిలోని గడ్డంవారిపల్లి సమీపంలో గురువారం చోటు చేసుకుంది. ఇదే మండలంలోని మల్లాగుండ్ల గ్రామానికి చెందిన అంకప్ప (55), కిరణ్‌ (15), మరో ఇద్దరు కలిసి సరదాగా కుందేలు వేటకు వెళ్లారు. మిట్ట మధ్యాహ్నం కావడంతో దాహం తీర్చుకునేందుకు సమీపంలోని తోటలోకి వెళ్లారు. అక్కడ సంపులో నీరు తాగడానికి ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు జారి సంపులోకి పడిపోయారు. భయంతో గట్టిగా కేకలు వేయడంతో వారితో వేటకు వెళ్లిన ఓబులేసు వచ్చేసరికి ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న సమీప గ్రామాలవారు అక్కడికి చేరుకుని సంపులో సుమారు రెండు గంటలపాటు గాలించి, ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు.

Updated Date - 2023-06-02T04:30:57+05:30 IST