ఆర్టీసీ ఈడీల బదిలీ

ABN , First Publish Date - 2023-06-01T05:26:52+05:30 IST

ఏపీఎస్‌ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు (ఈడీ) సహా పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మేనేజింగ్‌ డైరెక్టర్‌ తర్వాత పరిపాలన విభాగం ఈడీ పోస్టు

ఆర్టీసీ ఈడీల బదిలీ

● అడ్మిన్‌గా కేఎస్‌బీ రెడ్డి.. ఆపరేషన్స్‌కు కోటేశ్వరరావు

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్‌ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు (ఈడీ) సహా పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మేనేజింగ్‌ డైరెక్టర్‌ తర్వాత పరిపాలన విభాగం ఈడీ పోస్టు కీలకమైంది. ఈ స్థానంలో ఉన్న కోటేశ్వరరావును ఆపరేషన్స్‌ విభాగానికి పంపారు. ఆయన స్థానంలో ఆపరేషన్స్‌ ఈడీ కె.ఎస్‌. బ్రహ్మానంద రెడ్డిని నియమించారు. జోన్‌ –2 ఈడీ వెంకటేశ్వరరావును జోన్‌ –4కు.. అక్కడున్న గోపీనాథ్‌ రెడ్డిని జోన్‌–2కు బదిలీ చేస్తూ రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం, విశాఖపట్నం, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, విజయవాడలో పనిచేస్తున్న పలువురు డిప్యూటీ సీటీఎం, డిప్యూటీ సీఎంఈ స్థాయి అధికారులను సైతం బదిలీచేశారు.

Updated Date - 2023-06-01T05:26:52+05:30 IST