ఎవరి ఫ్యాను వారిదే!
ABN , First Publish Date - 2023-06-07T03:48:42+05:30 IST
ఒకపక్క తీవ్రమైన ఎండలు. మరోపక్క ఉక్కబోత. ఇలాంటి పరిస్థితుల్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు రోగుల విషయంలో చూపుతున్న నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది.
రాజమండ్రి జిల్లా ఆస్పత్రిలో ఉక్కబోతతో రోగుల యాతన
రాజమహేంద్రవరం అర్బన్, జూన్ 6: ఒకపక్క తీవ్రమైన ఎండలు. మరోపక్క ఉక్కబోత. ఇలాంటి పరిస్థితుల్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు రోగుల విషయంలో చూపుతున్న నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది. కొన్ని వార్డుల్లో ఫ్యాన్లు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇళ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. ఆర్థో వార్డు(మేల్)లో 17 బెడ్లు ఉండగా కనీసం ఫ్యాన్లు కూడా లేవు. రెండు ఏసీల్లో ఒకటి మూలనపడగా.. ఇంకో ఏసీ నుంచి గాలి రావడంలేదు. దీంతో రోగులు, వారి సహాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.