నేడు సంగమేశ్వరానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌

ABN , First Publish Date - 2023-03-26T04:06:41+05:30 IST

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఆదివారం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం క్షేత్రానికి రానున్నారు.

నేడు సంగమేశ్వరానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌

ఆత్మకూరు, మార్చి 25: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఆదివారం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం క్షేత్రానికి రానున్నారు. ఆయన హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో సంగమేశ్వరానికి చేరుకోనున్నారు. అక్కడ సప్తనదుల సంగమ ప్రదేశంలో పుణ్యస్నానం ఆచరించి ఆ తర్వాత గర్భాలయంలోని వేపదారు శివలింగాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. తిరుగు ప్రయాణంలో కొత్తపల్లి మండలంలోని ప్రముఖ వ్యాపారవేత్త, విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ మాజీ అధ్యక్షుడు దివంగత జి.పుల్లారెడ్డి స్వగ్రామమైన గోకవరం గ్రామం లో ఆర్‌ఎ్‌సఎస్‌ సహకారంతో నిర్వహిస్తున్న భక్త కన్నప్ప చెంచు గురుకుల ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తారు. అక్కడి నుంచి కర్నూలు వెళ్లనున్నారు.

Updated Date - 2023-03-26T04:06:54+05:30 IST