నాపై కుట్రలను నిలువరించండి
ABN , First Publish Date - 2023-06-02T04:44:15+05:30 IST
తనపై కుట్రలు జరుగుతున్నాయని, వాటిని నిరోధించాలని ముఖ్యమంత్రి జగన్ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ అంశాన్ని తాను చూసుకుంటానని ఆయనకు సీఎం సర్దిచెప్పారు. గురువారం
● సీఎం జగన్కు మాజీ మంత్రి బాలినేని వినతి
అమరావతి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తనపై కుట్రలు జరుగుతున్నాయని, వాటిని నిరోధించాలని ముఖ్యమంత్రి జగన్ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ అంశాన్ని తాను చూసుకుంటానని ఆయనకు సీఎం సర్దిచెప్పారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో బాలినేని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యవహారాలపై సీఎం ఆరా తీశారు. ఈ భేటీ అనంతరం బాలినేని ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. సీఎం తనను పిలిపించడంతో వెళ్లి కలిశానన్నారు. తనతో ఐప్యాక్ టీమ్ సభ్యులెవరూ లేరని, ఏకాంతంగా ముఖ్యమంత్రితో సమావేశమై జిల్లాలో నెలకొన్న పరిస్థితులను వివరించానని తెలిపారు. గతనెల 2న సీఎంను కలిసినప్పుడే ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని చెప్పానన్నారు. తాజా సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ పదవి అంశం ప్రస్తావనకు రాలేదని బాలినేని వివరించారు.