ఈశాన్య భారతం వరకు ‘నైరుతి’

ABN , First Publish Date - 2023-06-11T03:17:57+05:30 IST

నైరుతి రుతుపవనాలు శనివారం ఈశాన్య భారతం వరకు విస్తరించాయి. కేరళలో మిగిలిన ప్రాంతాలు, కర్ణాటకలో కొంత ప్రాంతం, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు, ఈశాన్య భారతంలో అనేక ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఈశాన్య భారతం వరకు ‘నైరుతి’

అసాధారణ తీవ్రతుఫాన్‌గా ‘బిపర్జాయ్‌’

విశాఖపట్నం, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు శనివారం ఈశాన్య భారతం వరకు విస్తరించాయి. కేరళలో మిగిలిన ప్రాంతాలు, కర్ణాటకలో కొంత ప్రాంతం, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు, ఈశాన్య భారతంలో అనేక ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో కర్ణాటకలో మరికొన్ని ప్రాంతాలు, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతంలో మిగిలిన భాగాలు, పశ్చిమ బెంగాల్‌, సబ్‌ హిమాలయాల్లో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని పేర్కొంది. కాగా, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అతి తీవ్ర తుఫాన్‌ ‘బిపర్జాయ్‌’ శనివారం రాత్రికి అసాధారణ తీవ్ర తుఫాన్‌గా బలపడనున్నది. ఈ క్రమంలో వాయువ్యంగా దిశ మార్చుకుని ఆదివారానికి స్వల్పంగా బలహీనపడి అతితీవ్ర తుఫాన్‌గా మారనున్నదని పేర్కొంది. ఈనెల 15వ తేదీ వరకు అతి తీవ్రతుఫాన్‌ సముద్రంలో కొనసాగుతుందని వివరించింది.

ఏడు రాష్ర్టాల్లో ఎండమంటలు

దేశవ్యాప్తంగా వచ్చే మూడు రోజులు బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ తోపాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వడగాల్పులు కొనసాగుతాయని భారత వాతావరణ సంస్థ తెలిపింది. ఇక, ఢిల్లీలో సీజన్‌ సగటు కంటే 26.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - 2023-06-11T03:17:57+05:30 IST