AP Congress President : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల!
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:37 AM
వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితురాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో విజయంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఏపీలో కూడా పార్టీ పుంజుకోవాలంటే
కొత్త ఏడాది ప్రారంభంలోనే నిర్ణయం?
ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల కీలక మంతనాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితురాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో విజయంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఏపీలో కూడా పార్టీ పుంజుకోవాలంటే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిలకు పార్టీ బాఽధ్యతలు అప్పగించాల ని భావిస్తున్నట్లు సమాచారం. అనుకున్నట్లు అ న్ని జరిగితే కొత్త ఏడాది ప్రారంభంలోనే షర్మిల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశముంది. ‘మాకు సమయం ఎక్కువగా లేదు. షర్మిల కాంగ్రెస్లో చేరితే ఏపీలో కాంగ్రె్సతో పాటు ఆమె భవితవ్యం కూడా బాగుంటుందని భావిస్తు న్నాం’ అని ఓ కాంగ్రెస్ నేత అన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో షర్మిల విషయం ఇప్పటికే చర్చించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏపీలో జగన్ అరాచక పాలనపై వైసీపీలోనే తీవ్ర అసంతృప్తి ఉందని, ఆ పార్టీకి చెందిన పలువురు నేత లు ఇప్పటికే షర్మిలతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ కు అంతర్గత సమాచారం అందింది. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వెంటనే పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్లో చేరతారని భావిస్తు న్నారు. వైసీపీతో ఉన్నది ప్రధానంగా కాం గ్రెస్ ఓటర్లేనని, షర్మిల కనుక కాంగ్రెస్ బాఽధ్యతలు స్వీకరిస్తే వైసీపీ ఓటర్లు కాం గ్రెస్ వైపు మళ్లుతారని భావిస్తున్నారు.
జగన్ ఒత్తిళ్లకు లొంగకుండా..
వాస్తవానికి తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల తన పార్టీని కాంగ్రె్సలో విలీనం చేసేందుకు కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే పార్టీలో చేర్చుకుని ఏపీలో ఆమె సేవలను వినియోగించుకోవాలని వారు భావించారు. అప్పట్నుంచే ఆమెతో ఢిల్లీ పెద్దలు టచ్లో ఉన్నట్లు సమాచారం. ఆమెను ఏపీ కాంగ్రె్సలో చేర్చుకోరాదని జగన్ ఎంత తీవ్ర ఒత్తిడి చేసినా లొంగకూడదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.