హక్కుల కమిషన్కు సదుపాయాలు కల్పించాలి: వర్ల
ABN , First Publish Date - 2023-06-02T04:37:34+05:30 IST
‘‘కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చాలా దుస్థితిలో ఉంది. కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక స్టెనో
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ‘‘కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చాలా దుస్థితిలో ఉంది. కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక స్టెనో గ్రాఫర్ లేదా టైపిస్ట్ను ఇవ్వలేని దౌర్భాగ్యంలో ఉంది. కమిషన్ ఆదేశాలు టైప్ చేసేందుకు టైపిస్ట్ లేకపోవడంతో కమిషన్ చైర్మనే స్వయంగా టైప్ చేసుకోవాల్సి రావడం ప్రభుత్వ సంస్థల దయనీయ స్థితికి అద్దం పడుతోంది’’ అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. దీనిపై గురువారం సీఎం జగన్కు ఆయన లేఖ రాశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు అవసరమైన సిబ్బందిని, కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు.