AP News: పవన్‌ తలపెట్టిన యాగం విజయవంతం కావాలి: రఘురామ

ABN , First Publish Date - 2023-06-12T15:05:19+05:30 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) తలపెట్టిన యాగం విజయవంతం కావాలని ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) ఆకాంక్షించారు.

AP News: పవన్‌ తలపెట్టిన యాగం విజయవంతం కావాలి: రఘురామ

ఢిల్లీ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) తలపెట్టిన యాగం విజయవంతం కావాలని ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) ఆకాంక్షించారు. పవన్ వారాహి యాత్ర విజయవంతం కావాలన్నారు. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయని జోస్యం చెప్పారు. జగనన్న విద్య దీవెన సభలో రాజకీయాలు మాట్లాడడం ఎందుకు? అని ప్రశ్నించారు. విద్య వ్యవస్థకు సీఎం జగన్ (CM Jagan) చేస్తున్నది ఏమిటీ? అని ప్రశ్నించారు. జగన్‌ బయోపిక్(యాత్ర 2) తీస్తున్నారని అంటున్నారని, ప్రజలు ఎవరూ ఆ సినిమా చూడరని రఘురామరాజు పేర్కొన్నారు.

అమిత్ షా ఏపీ ప్రభుత్వంపై క్షిపణిలా దాడి చేశారు

‘‘ఏపీ ప్రభుత్వం అవినీతిమయమని అమిత్ షా చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) సూటిగా ఏపీ ప్రభుత్వంపై క్షిపణిలా దాడి చేశారు. కేంద్రం పథకాలను తమవిగా ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందన్నారు. మొన్న నడ్డా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీలో ల్యాండ్, ఇసుక, మైనింగ్, ఎడ్యుకేషన్ అన్నిట్లో అవినీతి అన్నారు. బీజేపీ నేత నడ్డా, అమిత్ షా చెప్పిన మాటలే నేను గతంలో చెప్పాను. ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నానని నన్ను అరెస్ట్ చేసి.. నా పై రాజద్రోహం కేసు పెట్టారు. అమిత్ షా, నడ్డా వ్యాఖ్యలపై జగన్‌ రెడ్డి స్టాండ్ ఏమిటి?. నన్ను కొట్టినట్టు అమిత్‌ షా, నడ్డాను కొడతారా?’’ అని రఘురామ ప్రశ్నించారు.

Updated Date - 2023-06-12T15:05:19+05:30 IST