‘రెడ్బుక్’పై లోకేశ్కు నోటీసులు
ABN , Publish Date - Dec 30 , 2023 | 02:36 AM
రెడ్ బుక్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో సీఐడీ లోకేశ్కు నోటీసు జారీచేసింది.
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రెడ్ బుక్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో సీఐడీ లోకేశ్కు నోటీసు జారీచేసింది. శుక్రవారం ఆయనకు వాట్సాప్ ద్వారా సీఐడీ అధికారులు నోటీసు పంపారు. దానిని అందుకున్నట్లు లోకేశ్ వాట్సాప్ ద్వారానే సమాధానమిచ్చారు. ఈ కేసు విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు ఇప్పటికే జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.