జాతీయ సముద్ర ప్రయోజనాల పరిరక్షణే నేవీ లక్ష్యం
ABN , First Publish Date - 2023-06-01T05:35:10+05:30 IST
జాతీయ సముద్ర ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు భారత నౌకాదళం ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్.హరికుమార్ ప్రకటించారు.
● రాష్ట్రపతి అవార్డుల ప్రదాన సభలో నౌకాదళం ప్రధానాధికారి అడ్మిరల్ హరికుమార్
విశాఖపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి): జాతీయ సముద్ర ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు భారత నౌకాదళం ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్.హరికుమార్ ప్రకటించారు. విశాఖపట్నం నేవల్ డాక్యార్డులో శౌర్య, విశిష్ట, సేవా పతకాలను భారత రాష్ట్రపతి తరపున ఆయన బుధవారం నేవీ అధికారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ భారత నౌకాదళం తన ఆపరేషన్లను ఇంకా విస్తరిస్తుందన్నారు. అంతకు ముందు ఆయన 33 మందికి అవార్డులు అందజేశారు. వినీత్కుమార్, నిశాంత్లకు శౌర్యపతకాలు ప్రదానం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేసిందుకు మరో 13 మందికి, విశిష్ట సేవా పతకాలు 16 మందికి బహూకరించారు. ఇద్దరికి జీవన రక్ష పతకాలు అందజేశారు. వీటితో పాటు వెపన్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వీకే జైన్ మెమోరియల్ గోల్డ్ మెడల్ను, ఫైర్ సేఫ్టీలో రవిధీర్ మెమోరియల్ గోల్డ్మెడల్ను ఇచ్చారు. విశాఖ నేవల్ డాక్యార్డుకు బెస్ట్ గ్రీన్ ప్రాక్టీస్–2023 అవార్డు అందజేశారు.