మంత్రి కాకాణిపై చర్యలు తీసుకోవాలి: అచ్చెన్న
ABN , Publish Date - Dec 18 , 2023 | 02:52 AM
సహజ వనరుల్ని వైసీపీ నేతలు యథేచ్ఛగా దోపిడీ చేస్తుంటే అధికారులు ఏంచేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): సహజ వనరుల్ని వైసీపీ నేతలు యథేచ్ఛగా దోపిడీ చేస్తుంటే అధికారులు ఏంచేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అక్రమ మైనింగ్పై 21 రోజులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి పోరాటం చేస్తున్నా, పోలీసులు స్పందించకపోవడంపై మండిపడ్డారు. అక్రమ మైనింగ్ను వెంటనే నిలిపివేసి, మైన్ ద్వారా కోట్లు కొల్లగొడుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.