Adimulapu Suresh : టిడ్కో లే అవుట్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న మంత్రి ఆదిమూలపు సురేష్

ABN , First Publish Date - 2023-05-10T13:46:09+05:30 IST

గుడివాడ మల్లాయిపాలెం లేఅవుట్‌లో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించారు. కలెక్టర్ రాజబాబు, అధికార యంత్రాంగంతో కలిసి, టిడ్కో ఫ్లాట్లను సురేష్ పరిశీలించారు.

Adimulapu Suresh : టిడ్కో లే అవుట్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న మంత్రి ఆదిమూలపు సురేష్

విజయవాడ : గుడివాడ మల్లాయిపాలెం లేఅవుట్‌లో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించారు. కలెక్టర్ రాజబాబు, అధికార యంత్రాంగంతో కలిసి, టిడ్కో ఫ్లాట్లను సురేష్ పరిశీలించారు. లేఅవుట్లో అభివృద్ధి పనులపై, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టిడ్కో లే అవుట్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని, ప్రతిపక్షాలకు మంత్రి సురేష్ సవాల్ విసిరారు. టిడ్కో నిర్మాణాలపై టీడీపీ నేతలు పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. నామమాత్రంగా నిర్మించిన ఫ్లాట్లను టీడీపీ హయాంలో ప్రారంభించారన్నారు. టీడీపీ నేతలు ప్రారంభించిన ఇళ్ళలో ఒకరైన నివాసం ఉంటున్నారా? అని మంత్రి ప్రశ్నించారు. 14 వేల కోట్ల అదనపు ఖర్చుతో లే అవుట్ల అభివృద్ధి చేశారన్నారు. ప్రజలు నేరుగా వచ్చి నివాసముండేలా 50 వేల టిడ్కో ఫ్లాట్లను 100 శాతం నిర్మించామన్నారు. వైసీపీ హయాంలో టిడ్కో లబ్ధిదారులకు 400 కోట్ల రాయితీలు ఇవ్వాలన్నారు. జగన్ ఇస్తున్న ఇళ్లకు.. పదే పదే టీడీపీ నేతలు చెబుతున్న ప్లాట్లకు ఎటువంటి పోలిక లేదన్నారు. పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని.. గుడివాడ టిడ్కో ప్లాట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలో ప్రారంభిస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-10T13:46:09+05:30 IST