Share News

శ్రీవారి సేవలో పలువురు న్యాయమూర్తులు

ABN , Publish Date - Dec 24 , 2023 | 03:08 AM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుప్రీంకోర్టు, ఏపీ, తెలంగాణ, మద్రాస్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు పలువురు తిరుమల శ్రీవారిని శనివారం దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ , న్యాయమూ

శ్రీవారి సేవలో పలువురు న్యాయమూర్తులు

తిరుమల, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుప్రీంకోర్టు, ఏపీ, తెలంగాణ, మద్రాస్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు పలువురు తిరుమల శ్రీవారిని శనివారం దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ , న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, సూర్యకాంత్‌, హిమా కోహ్లి, ఎస్వీ భట్టి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రవీంద్రబాబు, జస్టిస్‌ జ్యోతిర్మయి, జస్టిస్‌ శ్యాంసుందర్‌, జస్టిస్‌ రాజశేఖర్‌, జస్టిస్‌ సుజాత, జస్టిస్‌ శేషసాయి, జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ జయసూర్య, జస్టిస్‌ సుబ్బారెడ్డి, మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ లక్ష్మీనారాయణ, జస్టిస్‌ నాగార్జున వీరిలో ఉన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యపల్లి నంద, జస్టిస్‌ శ్రీనివాసరావు, జస్టిస్‌ వేణుగోపాల్‌, జస్టిస్‌ సాంబశివరావు వైకుంఠద్వార ప్రవేశం చేశారు.

Updated Date - Dec 24 , 2023 | 03:08 AM