మహిళలకు పట్టం కట్టిన మహానాడు: అనిత

ABN , First Publish Date - 2023-06-02T04:34:23+05:30 IST

రాజమండ్రి వేదికగా నిర్వహించిన టీడీపీ మహానాడు రాష్ట్ర రాజకీయాలను సరికొత్త మలుపు తిప్పింది.

మహిళలకు పట్టం కట్టిన మహానాడు: అనిత

మహారాణిపేట (విశాఖపట్నం), మే 1: ‘‘ రాజమండ్రి వేదికగా నిర్వహించిన టీడీపీ మహానాడు రాష్ట్ర రాజకీయాలను సరికొత్త మలుపు తిప్పింది. మహిళలకు పట్టం కట్టింది’’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం ఆమె మాట్లాడారు. ‘‘చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఉంటుంది. టీడీపీ మొదటి మేనిఫేస్టో విడుదల చేసేసరికి వైసీపీకి చెందిన 18 మంది మంత్రులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. సీఎం జగన్‌కు మహిళల కోసం మాట్లాడే నైతిక హక్కులేదు. నాలుగేళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి, టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. వైసీపీ నేతలు ఎవరైనా చర్చకు రావాలి. స్పీకర్‌ తమ్మినేని సీతారాం గతం మరచిపోయి, మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా మాట్లాడుతున్నారు. బ్లాక్‌ కమాండోలు కాదు చంద్రబాబు వద్ద 70 లక్షల మంది ఎల్లో కమాండోలు ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది’’ అని అనిత పేర్కొన్నారు.

Updated Date - 2023-06-02T04:34:23+05:30 IST