వామపక్షాల ఆందోళన 11కు వాయిదా

ABN , First Publish Date - 2023-06-07T04:16:38+05:30 IST

కేంద్ర హోంమంత్రి పర్యటనను నిరసిస్తూ పది వామపక్ష పార్టీలు తలపెట్టిన ఉమ్మడి ఆందోళన ఈ నెల 11వ తేదీకి వాయిదా పడింది.

వామపక్షాల ఆందోళన 11కు వాయిదా

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి పర్యటనను నిరసిస్తూ పది వామపక్ష పార్టీలు తలపెట్టిన ఉమ్మడి ఆందోళన ఈ నెల 11వ తేదీకి వాయిదా పడింది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించనున్న బహిరంగసభ, హోంమంత్రి పర్యటన జూన్‌ 11కి వాయిదా పడినందున.. తమ ఆందోళన కార్యక్రమాన్ని కూడా అదే తేదీకి వాయిదా వేశామని తెలిపారు.

Updated Date - 2023-06-07T04:16:38+05:30 IST