తెప్పలపై కృష్ణస్వామి విహారం

ABN , First Publish Date - 2023-06-01T01:59:53+05:30 IST

శ్రీవారి దేవేరి,తిరుచానూరు పద్మావతీ దేవి తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు బుధవారం సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుడు పద్మసరోవరంలో తెప్పలపై విహరించారు.

తెప్పలపై కృష్ణస్వామి విహారం
పద్మసరోవరంలో తెప్పలపై విహరిస్తున్న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి

ప్రారంభమైన పద్మావతీ దేవి తెప్పోత్సవాలు

తిరుచానూరు, మే 31: శ్రీవారి దేవేరి,తిరుచానూరు పద్మావతీ దేవి తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు బుధవారం సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుడు పద్మసరోవరంలో తెప్పలపై విహరించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు బుధవారం మధ్యాహ్నం కేటీ మండపంలో శ్రీకృష్ణస్వామికి నేత్రపర్వంగా అభిషేకాలు జరిగాయి. సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామిని పద్మసరోవరానికి వేంచేపు చేసి తెప్పలపై కొలువుతీర్చారు. ఉభయదేవేరులతో స్వామివారు పద్మసరోవరంలో మూడు పర్యాయాలు విహరించారు. గురువారం సాయంత్రం సుందరరాజస్వామిగా విహరించనున్నారు. చివరి మూడు రోజులు పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. శనివారం గజవాహనం, ఆదివారం గరుడవాహన సేవ జరగనున్నాయి.డిప్యూటీ ఈవో గోవిందరాజన్‌, ఏఈవో ప్రభాకర రెడ్డి, ఏవీఎస్వో శైలేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T01:59:53+05:30 IST