అప్పన్న సన్నిధిలో జస్టిస్ శేషసాయి
ABN , First Publish Date - 2023-06-02T04:50:01+05:30 IST
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి సతీసమేతంగా గురువారం
కప్ప స్తంభం వద్ద జస్టిస్ శేషసాయి దంపతులు
సింహాచలం, జూన్ 1: హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి సతీసమేతంగా గురువారం సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని విశిష్ట కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న న్యాయమూర్తి దంపతులు స్వామికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి దేవస్థానం విజిటర్స్ బుక్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా...అని రాసి తెలుగులో సంతకం చేశారు.