మళ్లీ రావాలనిపిస్తోంది
ABN , First Publish Date - 2023-07-21T03:08:57+05:30 IST
తాను బదిలీపై వెళ్తున్నప్పటికీ తిరిగి ఏపీ హైకోర్టుకు రావాలనిపిస్తోందని జస్టిస్ డి.రమేశ్ వ్యాఖ్యానించారు.
హైకోర్టు నుంచి బదిలీ అయిన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్
విజయవాడ, జూలై 20(ఆంధ్రజ్యోతి): తాను బదిలీపై వెళ్తున్నప్పటికీ తిరిగి ఏపీ హైకోర్టుకు రావాలనిపిస్తోందని జస్టిస్ డి.రమేశ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ చూపించిన ఆదరాభిమానాలు ఎన్నటికీ మరువలేనని చెప్పారు. జస్టిస్ రమేశ్ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ కావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాలులో గురువారం రాత్రి వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి హాజరయ్యారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ సోమయాజులు, జస్టిస్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.