ప్రచారానికి ‘జూనియర్‌’ వస్తాడు

ABN , First Publish Date - 2023-03-26T03:28:44+05:30 IST

‘‘అవసరమైనప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ తప్పకుండా వస్తాడు.

ప్రచారానికి ‘జూనియర్‌’ వస్తాడు

ఎమ్మెల్సీ ఫలితాలు మార్పునకు సంకేతం: నారా రోహిత్‌

అనంతపురం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ‘‘అవసరమైనప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ తప్పకుండా వస్తాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం మార్పునకు సంకేతం’’ అని సినీ నటుడు నారా రోహిత్‌ పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు రోహిత్‌ సంఘీభావం తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ఓడీచెరువు మండలం వనుకువారిపల్లి విడిది శిబిరంలో శనివారం ఆయన లోకేశ్‌ను కలిశారు. అనంతరం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా రోహిత్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు నాయకత్వం, పాలన ఎలాగుంటుందో ప్రజలు పూర్తిగా తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వరుస విజయాలతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. టీడీపీ విజయాన్ని జీర్ణించుకోలేకే బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీపైన ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.’’ అని రోహిత్‌ అన్నారు.

Updated Date - 2023-03-26T03:28:44+05:30 IST