దళితుల్ని మోసగిస్తున్న జగన్: బీజేపీ
ABN , First Publish Date - 2023-03-26T04:25:40+05:30 IST
సీఎం జగన్ దళితుల్ని మోసగించే నిర్ణయాలు తీసుకొంటున్నారని బీజేవైఎం మండిపడింది.
అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ దళితుల్ని మోసగించే నిర్ణయాలు తీసుకొంటున్నారని బీజేవైఎం మండిపడింది. దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చడాన్ని నిరసిస్తూ బీజేపీతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కలెక్టరేట్ల ముందు నిరసన చేపడుతున్నట్లు ప్రకటించింది. ఓట్ల కోసం జగన్ తీసుకుంటున్న చర్యలవల్ల అసలైన దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని యువమోర్చా ఉపాధ్యక్షుడు రవీంద్రారెడ్డి అన్నారు. ‘‘కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాలు చేస్తోంది. సుప్రీం కోర్టులో ఉన్న అంశంపై ఎలా తీర్మానం చేస్తారు? ఎస్సీలు ఇప్పటికే సరైన ఉద్యోగాల్లేక ఇబ్బంది పడుతుంటే అంబేడ్కర్ ఆలోచనలకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వం తీర్మానాలు చేయడం గర్హనీయం’’ అని రవీంద్రారెడ్డి మండిపడ్డారు.