Share News

లోకేశ్‌కు ఐటీ నిపుణుల సంఘీభావం

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:07 AM

లోకేష్‌ పాదయాత్రలో ఆదివారం పలువురు ఐటీ నిపుణులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

లోకేశ్‌కు ఐటీ నిపుణుల సంఘీభావం

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి రాక

లోకేష్‌ పాదయాత్రలో ఆదివారం పలువురు ఐటీ నిపుణులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. వీరంతా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి మూడు ప్రత్యేక బస్సుల్లో తరలివచ్చారు. తోటాడ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడ నుంచి పరవాడ నియోజకవర్గం భరణికం వరకు నడిచారు. ఈ సందర్భంగా ఐటీ నిపుణులు తేజస్విని, హిమబిందు తదితరులు మాట్లాడారు. లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొనడం గర్వంగా భావిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం అభివృద్ధి చెందడంతో అనేక మందికి ఉపాధి కలిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తామంతా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో పనిచేస్తున్నామని, అదే మన రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందితే తమతో పాటు అనేక మందికి ఇక్కడే ఉపాధి దొరుకుతుందన్నారు. అది చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు.

Updated Date - Dec 18 , 2023 | 03:07 AM