Share News

గిరి బాటలో పల్లెకు పయనమైన ఐపీఎస్‌

ABN , First Publish Date - 2023-11-10T04:22:34+05:30 IST

కమ్యూనిటీ పోలిసింగ్‌లో భాగంగా గిరి బాట పట్టారు ఓ ఐపీఎస్‌ అధికారి. లోతట్టు అటవీ ప్రాంతంలో 7కి.మీ. నడిచి మారుమూల గిరిజన గ్రామానికి చేరుకున్నారు. రాజవొమ్మంగి

గిరి బాటలో పల్లెకు పయనమైన ఐపీఎస్‌

రాజవొమ్మంగి, నవంబరు 9: కమ్యూనిటీ పోలిసింగ్‌లో భాగంగా గిరి బాట పట్టారు ఓ ఐపీఎస్‌ అధికారి. లోతట్టు అటవీ ప్రాంతంలో 7కి.మీ. నడిచి మారుమూల గిరిజన గ్రామానికి చేరుకున్నారు. రాజవొమ్మంగి మండలం, లోదొడ్డి పంచాయతీ, కిండంగి గ్రామం... చాలామంది అధికారులకు ఈ గ్రామం ఉందనే విషయమే తెలియదు. రోగమొచ్చినా, రొప్పొచ్చినా డోలీలే గతి. జడ్డంగి ఎస్‌ఐ రఘునాథరావు స్థానిక పరిస్థితులను ఉన్నాతాధికారులకు నివేదించారు. దీంతో గురువారం ఆ గ్రామంలో సీఐ బాజీలాల్‌ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్‌ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రంపచోడవరం ఏఎస్పీ జగదీశ్‌ ఆడహళ్లి వచ్చారు. నడకమార్గం తప్ప మరో దారిలేని కిండంగి బాట పట్టిన జగదీశ్‌ 7కి.మీ. నడిచారు. అతికష్టంమీద ఇతర పోలీస్‌ అధికారులతో కలసి గ్రామానికి చేరుకున్నారు. గిరిజనుల సమస్యలను సావధానంగా తెలుసుకున్నారు. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Updated Date - 2023-11-10T04:22:35+05:30 IST