Share News

దోపిడీ శాఖల్లో.. అందరూ జగన్‌ వర్గమే

ABN , First Publish Date - 2023-11-29T04:39:13+05:30 IST

సీఎం జగన్‌ తన సామాజిక వర్గానికి చెందినవారిని కేంద్రం నుంచి పనిగట్టుకుని డిప్యుటేషన్లపై రాష్ట్రానికి రప్పించి..

దోపిడీ శాఖల్లో.. అందరూ జగన్‌ వర్గమే

కేంద్రం నుంచి రప్పించి మరీ అప్పగించారు: అచ్చెన్న

అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ తన సామాజిక వర్గానికి చెందినవారిని కేంద్రం నుంచి పనిగట్టుకుని డిప్యుటేషన్లపై రాష్ట్రానికి రప్పించి.. తన దోపిడీ మొత్తం వారితోనే చేయిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆయన హయాంలో 16మంది డిప్యుటేషన్‌పై వస్తే అందులో పదిమంది ఆయన సామాజిక వర్గానికి చెందినవారేనని చెప్పారు. రూ.వేల కోట్ల దోపిడీకి అవకాశం ఉన్న శాఖలను గుర్తించి అక్కడ వారిని పెట్టి.. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. దోపిడీలో భాగస్వాములైన అధికారులు ఏ కలుగులో దాక్కున్నా రప్పించి బోనులో నిలబెట్టడం ఖాయమని అచ్చెన్న హెచ్చరించారు.

Updated Date - 2023-11-29T04:40:08+05:30 IST