ఆంధ్రలో ఇడ్లీ, దోశ అదుర్స్‌

ABN , First Publish Date - 2023-06-02T04:33:20+05:30 IST

ఆంధ్రలో ఇడ్లీ, దోశ తనకెంతో నచ్చాయని స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ యాత్రికుడు రోలాన్స్‌ అన్నారు.

ఆంధ్రలో ఇడ్లీ, దోశ అదుర్స్‌

ప్రపంచ యాత్రికుడు రోలాన్స్‌.. స్విట్జర్లాండ్‌ నుంచి సైకిల్‌పై వరల్డ్‌ టూర్‌

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 1: ఆంధ్రలో ఇడ్లీ, దోశ తనకెంతో నచ్చాయని స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ యాత్రికుడు రోలాన్స్‌ అన్నారు. 2020 లో సైకిల్‌పై ప్రపంచయాత్ర మొదలుపెట్టిన 62 ఏళ్ల రోలాన్స్‌.. ఇప్పటివరకు 47 దేశాల్లో 37,620 కిలోమీటర్లు పూర్తిచేశారు. ఈ క్రమంలో గురువారం ఒంగోలు మీదుగా విజయవాడ వైపు వెళుతున్న ఆయనకు స్థానిక చర్చి సెంటర్‌లో స్థానిక యువకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రోలాన్స్‌ మాట్లాడుతూ.. భారత్‌లో కోల్‌కతా, ఆగ్రా, ఢిల్లీ, బెంగళూరు, కన్యాకుమారి వంటి నగరాలతోపాటు భారత్‌లోనే 5,500 కిలోమీటర్లు యాత్ర పూర్తయిందని తెలిపారు. తాను పర్యటించే ప్రాంతాల్లో లభించే ఆహారం తీసుకుంటూ, ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ సైకిల్‌ యాత్ర చేయడం వల్ల ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించారు. ఆంధ్రలో ఇడ్లీ, దోశ తనకెంతో నచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని పలువురు యువత రోలాన్స్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.

Updated Date - 2023-06-02T04:33:47+05:30 IST