నల్లపూసల దండ మింగేశాడు

ABN , First Publish Date - 2023-06-02T04:31:06+05:30 IST

మానసిక స్థితి సరిగాలేని ఓ వ్యక్తి నల్లపూసల దండ మింగేశాడు. మూడు నెలలపాటు అలాగే తిరిగాడు. ఇటీవల కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరడంతో అసలు విషయం గుర్తించిన వైద్యులు ఎలాంటి ఆపరేషన్‌

నల్లపూసల దండ మింగేశాడు

ఆపరేషన్‌ లేకుండా బయటకు తీసిన వైద్యులు

ధర్మవరం, జూన్‌ 1: మానసిక స్థితి సరిగాలేని ఓ వ్యక్తి నల్లపూసల దండ మింగేశాడు. మూడు నెలలపాటు అలాగే తిరిగాడు. ఇటీవల కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరడంతో అసలు విషయం గుర్తించిన వైద్యులు ఎలాంటి ఆపరేషన్‌ లేకుండానే ఆ గొలుసును బయటకు తీశారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని రాజేంద్రనగర్‌కు చెందిన రామాంజినేయులు దోబీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కొంతకాలంగా ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న దండ మింగేశాడని, ఆపరేషన్‌ లేకుండా ప్రత్యేక పరికరం ఉపయోగించి నోటి ద్వారా గొలుసుని బయటకు తీశామని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Updated Date - 2023-06-02T04:31:06+05:30 IST