స్పీకర్‌ వ్యాఖ్యలను అసహ్యించుకుంటున్నారు: కూన

ABN , First Publish Date - 2023-06-02T04:35:08+05:30 IST

స్పీకర్‌ తమ్మినేని వ్యాఖ్యలను తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ విప్‌,

స్పీకర్‌ వ్యాఖ్యలను అసహ్యించుకుంటున్నారు: కూన

శ్రీకాకుళం, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): స్పీకర్‌ తమ్మినేని వ్యాఖ్యలను తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ విప్‌, తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ పేర్కొన్నారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’తో ఆయన మాట్లాడారు. ‘‘ప్రభుత్వ అధినేతలుగా హత్యలు చేయించినవారే ఉన్నారు. ఈ విషయం టీడీపీ ఆరోపించడంలేదు. సీబీఐ చార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. జగన్‌, ఆర్థిక ఉగ్రవాది అని కోర్టులే చెప్పాయి. జగన్‌ నుంచి ప్రజలకు రక్షణ కావాలి. కోడికత్తి డ్రామాలు, బాబాయిని చంపేసి రోడ్లపైనే తిరుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో స్పీకర్‌పై అసహ్యం పెరిగింది. ప్రజలు ఖాండ్రించి ఉమ్మివేస్తే ఆ ప్రవాహంలో ఇటువంటి డమ్మాబుస్సుల సీతారాం కొట్టుకుపోతారు’’ అని రవికుమార్‌ అన్నారు.

Updated Date - 2023-06-02T04:35:08+05:30 IST