ఆరోగ్యశాఖలో ఎఫ్ఆర్ఎస్!
ABN , First Publish Date - 2023-07-19T03:10:19+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎ్ఫఆర్ఎస్) ఆధారంగా జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉద్యోగుల జీతాలకు లింకు పెట్టిన వైసీపీ ప్రభుత్వం
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎ్ఫఆర్ఎస్) ఆధారంగా జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూలై నెల జీతాల బిల్లుతో పాటు ఉద్యోగుల ఎఫ్ఆర్ఎస్ వివరాలు అనుసంధానించి పంపాలని ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా వైద్యాధికారులకు మంగళవారం ప్రత్యేక సర్య్కులర్ జారీ అయింది.