MLA Gorantla : శంకుస్థాపనలు మళ్లీ మళ్లీ
ABN , First Publish Date - 2023-06-01T05:23:37+05:30 IST
పెళ్లి మళ్లీ మళ్లీ అనే సిద్ధాంతాన్ని సీఎం జగన్ ఫాలో అవుతున్నాడని అందుకే చేసిన వాటికే మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేసి ఏదో సాధించినట్లు ఫీల్
● టీడీపీ సునామీలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం
● ఎంపీ అవినాశ్ది అంతులేని కథ: గోరంట్ల
రాజమహేంద్రవరం సిటీ, మే 31: పెళ్లి మళ్లీ మళ్లీ అనే సిద్ధాంతాన్ని సీఎం జగన్ ఫాలో అవుతున్నాడని అందుకే చేసిన వాటికే మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేసి ఏదో సాధించినట్లు ఫీల్ అవుతున్నాడని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. బుధవారం తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం, మచిలీపట్టణం పోర్టులకు మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేయడం తప్పా జగన్ చేసిందేమీలేదన్నారు. జగన్ పాలనలో అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. జగన్ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం పెరిగిందన్నారు. సొంత బాబాయిని హత్య చేయించిన జగన్కు ప్రత్యేక భద్రత కావాలా? అని ప్రశ్నించారు. కేంద్ర భద్రతను చంద్రబాబుకు తొలగించాలని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించడాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఎదుర్కోలేక చంద్రబాబు హత్యకు కుట్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. జగన్కు జైలుకు వెళ్లాల్సివుండగా దానికన్నా ముందు ఎర్రగడ్డకు వెళ్లాలని భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎంపీ అవినాష్రెడ్డిది అంతులేని కఽథలా మారిందన్నారు. ఎంపీ భరత్ రామ్, జిల్లా కలెక్టర్లు చేస్తున్న అరాచకాలు మరింతగా పెరుగుతున్నాయని ఆ చిట్టా ఎమిటో తేలుస్తామని అన్నారు. మహానాడు విజయవంతానికి సహకరించిన గంగుమళ్ల సత్యనారాయణ, నాని, అమరనాఽథ్, డాక్టర్ చలం, సంజీవరావు, రాంబాబు, చెల్లుబోయిన శ్రీను, పితాని శివరామకృష్ణ, శ్రవణ్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లా ఎస్పీ, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.