ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ శంకర్రావ్‌

ABN , First Publish Date - 2023-07-08T03:45:11+05:30 IST

రాష్ట్ర గిరిజన కమిషన్‌ చైర్మన్‌గా పార్వతీపురం మాజీ ఎంపీ దాడిచిలుక వీర గౌరి శంకర్‌రావును నియమిస్తూ గిరిజన

ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ శంకర్రావ్‌

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గిరిజన కమిషన్‌ చైర్మన్‌గా పార్వతీపురం మాజీ ఎంపీ దాడిచిలుక వీర గౌరి శంకర్‌రావును నియమిస్తూ గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఇటీవల వరకు ఎస్టీ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న కుంభా రవిబాబుకు 65 ఏళ్లు నిండటంతో ఆయన పదవీకాలం పూర్తయింది.

జగన్‌కు బుద్ధి చెప్తాం: యానాదుల సంఘం

ఎస్టీ కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవిని మరోసారి ఏజెన్సీ గిరిజనులకివ్వడం ద్వారా మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం చేశారని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య అన్నారు. మైదాన ప్రాంత గిరిజనులందరినీ ఐక్యం చేసి వచ్చే ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్తామన్నారు.

Updated Date - 2023-07-08T03:45:11+05:30 IST